వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2022-05-17T06:33:44+05:30 IST
వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత
కల్లూరు, మే 16: వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత అన్నారు. కల్లూరు అర్బన్ 41వ వార్డు వీకర్ సెక్షన్ కాలనీలో వార్డు ఇన్చార్జి శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నాగులకట్ట నుంచి ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నినాదా లు చేస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ సంపద సృష్టించలేని సీఎం జగన్ పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్, బస్సుల చార్జీలు పెంచుతూ.. చెత్తపై పన్నులు వేస్తూ మరోవైపు రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్గా తయారు చేసి మద్యం పాలసీ ద్వారా ఖజానా నింపుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడాలని, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కాసాని మహే్షగౌడు, పాణ్యం తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్గౌడు, మైనార్టీ అధ్యక్షుడు ఫిరోజ్, ఎన్వీ రామకృష్ణ, రవిప్రకాష్ రెడ్డి, తిమ్మారెడ్డి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.