ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తారు

ABN , First Publish Date - 2022-01-22T06:18:59+05:30 IST

ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలతో విసుగెత్తిన వారు రోడ్లపైకి వచ్చి పోరా టాలు చేస్తారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు.

ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తారు

మామిడికుదురు, జనవరి 21: ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలతో విసుగెత్తిన వారు రోడ్లపైకి వచ్చి పోరా టాలు చేస్తారని మాజీ మంత్రి గొల్లపల్లి  సూర్యారావు పేర్కొన్నారు. శుక్రవారం మామిడికుదురులో టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మొల్లేటి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన గౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైసీపీ హయాంలో అన్ని రంగాలు, అన్ని కులాలవారు  దెబ్బతిన్నార న్నారు. ఈప్రభుత్వం త్వరలో గద్దె దిగడం ఖాయమన్నారు. సభలో ఈలి శ్రీనివాస్‌, బోనం బాబు, అడబాల సాయిబాబు, వర్ధినేని బాబ్జీ, కాండ్రేగుల భవానీలావణ్య, సర్పంచ్‌ జాలెం రమణకుమారి, కొండా జగదీష్‌, జాలెం సుబ్బారావు, యర్రం శెట్టి తాతబుజ్జి, కొల్లాబత్తుల వెంకరమణ, అనుసూరి శ్రీను, నల్లి శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T06:18:59+05:30 IST