చట్టాలపై అవగహన ఉండాలి
ABN , First Publish Date - 2022-05-26T06:44:37+05:30 IST
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి అన్నారు.
ముసునూరు, మే 25: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గా కల్యాణి అన్నారు. బుధవారం గోపవరం సచివాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను నిర్మూలించేందుకు దిశ, నిర్భయ తదితర చట్టాలను రూపొందించటం జరిగిందన్నారు. భూ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సర్పంచ్ కంచర్ల వాణి, కార్యదర్శి ఆరేపల్లి వెంకటేశ్వరావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.