అసలైన ఫ్యాక్షనిస్టు పాలన చూస్తున్న ప్రజలు: కన్నా

ABN , First Publish Date - 2021-01-22T09:11:04+05:30 IST

అసలైన ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

అసలైన ఫ్యాక్షనిస్టు పాలన చూస్తున్న ప్రజలు: కన్నా

గుంటూరు(సంగడిగుంట), జనవరి 21: అసలైన ఫ్యాక్షనిస్టు పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. డీజీపీ కార్యాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో గుంటూరు జిల్లాలో బీజేపీ నేతలను గురువారం రాత్రి పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు. ‘‘ప్రశ్నించిన వారిని అరెస్టు చేయడం, గొంతెత్తిన వారిని హత్య చేయడం ఫ్యాక్షనిస్టు చర్యలు. అవి ప్రస్తుతం చూస్తున్నాం. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి చేతగాని, అసమర్థ ముఖ్యమంత్రిని చూడలేదు. వారం రోజుల్లో దేవాలయాల దాడుల్లో దోషులను పట్టుకోకపోతే బీజేపీ నేతల ప్రతిస్పందన ప్రభుత్వం చూడాల్సి వస్తుంది’’ అని కన్నా హెచ్చరించారు. 

Updated Date - 2021-01-22T09:11:04+05:30 IST