ప్రజలను కరోనా నుంచి రక్షించాలి

ABN , First Publish Date - 2021-04-24T04:51:29+05:30 IST

ప్రజలను కరోనా బారినుంచి రక్షించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పీరయ్య కోరారు. కార్పొరేషన్‌లో శుక్రవారం కమిషనర్‌ లవన్నకు ఆయన వినతిపత్రం సమర్పించారు.

ప్రజలను కరోనా నుంచి రక్షించాలి
కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నేతలు

కమిషనరుకు టీడీపీ నాయకుల వినతి

కడప(ఎర్రముక్కపల్లె), ఏప్రిల్‌ 23: ప్రజలను కరోనా బారినుంచి రక్షించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పీరయ్య కోరారు. కార్పొరేషన్‌లో శుక్రవారం కమిషనర్‌ లవన్నకు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా సమయంలో కార్పొరే షన్‌ అధికారులు కరోనా నియంత్రణపై బాగా పనిచేశారని, ప్రస్తుతం కూడా అలాగే పనిచేసి ప్రజలను కాపాడాలన్నారు. ప్రతి డివిజన్‌లో పూర్తి స్థాయిలో శానిటేషన్‌ చేసి, బ్లీచింగ్‌ పౌడరును చల్లించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిలానీబాషా, జయచంద్ర, వై.రాంప్రసాద్‌, గురప్ప, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:51:29+05:30 IST