అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-25T06:46:12+05:30 IST

అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో రాజేందర్‌ అన్నారు.

అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో రాజేందర్‌

లక్ష్మణచాంద, జూన్‌ 24 : అసంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో రాజేందర్‌ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క ఉపకేంద్రం అయినటువంటి పార్‌పెల్లి అనుసంధాన గ్రామాలు అయినటువంటి పీచర, ధర్మారం గ్రామాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ గ్రామాల్లో 6,412 జనాభా ఉండగా, ఇందులో 30 సంవత్సరాల పైబడిన వారు 3.000 జనాభా ఉన్నారని, వీరికి పరీక్షలు నిర్వహించగా బీపీ, షుగర్‌, క్యాన్సర్‌తో 580 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. దీనికొరకు అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వైద్య అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం పార్‌పెల్లిలో శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 62 మందికి రక్తపరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగాం కోఆర్డినేటర్‌ విమల, ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:46:12+05:30 IST