మోదీ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలి

ABN , First Publish Date - 2022-06-30T08:13:28+05:30 IST

సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ జూలై మూడో తేదీన జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు కోరారు.

మోదీ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నబీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట సిటీ, జూన్‌ 29: సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ జూలై మూడో తేదీన జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు కోరారు.  బుధవారం హైదరాబాద్‌ నుంచి కొత్తగూడెం వెళ్లుతున్న ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ధరమ్‌ లాల్‌ కౌశిక్‌ సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర్‌రావు నివాసంలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఆధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో బీజేపీ జాతీయస్థాయి నాయకులను ఇన్‌చార్జిలుగా నియమించారన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఇన్‌చార్జులు  పర్యటించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతారన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని, ఎన్నికల హామీలను సీఎం కేసీఆర్‌ మరిచిపోయాడని అన్నారు. సమావేశంలో  బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్‌, పట్టణ అధ్యక్షుడు ఎండీ అబీద్‌, మాజీ కౌన్సిలర్‌ చల్లమళ్ల నర్సింహ మీర్‌అక్బర్‌, అరూర్రి శివ, సంధ్యాల సైదులు, బిట్టు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T08:13:28+05:30 IST