అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదు

ABN , First Publish Date - 2021-04-24T04:28:44+05:30 IST

ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు అ త్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు.

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదు
కరోనాపై అవగాహన కార్యక్రమంలో ఏసీపీ అఖిల్‌ మహాజన్‌

 మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ 

హాజీపూర్‌, ఏప్రిల్‌ 23 : ప్రస్తుత కరోనా సమయంలో ప్రజలు అ త్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నిబంధ నలను పాటిస్తూ మాస్క్‌ ధ రించి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. హాజీపూర్‌ పోలీసుల ఆ ధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా కరోనాప యుద్ధం పే రుతో గ్రామపంచాయతీలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు. మండలంలోని దొనబండ గ్రామంలో సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు కరోనా అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అవగాహన కా ర్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైరస్‌ విజృంభిస్తున్న తరు ణంలో ప్రతీ ఒక్కరుమాస్క్‌ ధరించి బయటకు రావాలన్నారు. మాస్క్‌ లేకుండా బయట తిరిగితే రూ. వేయి జరిమానా విధిస్తామన్నారు.   ఈ కార్యక్రమంలో సీఐ కుమారస్వామి, ఎస్సై చంద్రశేఖర్‌, ఏఎస్సై అ యాజ్‌ఖాన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శేషాద్రి, ఎంపీడీఓ మహ్మద్‌ అబ్దుల్‌ హై, ఉపాధిహామీ ఏపీఓ మల్లయ్య, ఎంపీఓ రవి బా బు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:28:44+05:30 IST