ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-19T05:23:10+05:30 IST

ప్ర జల సమస్యలను అధికారులు సత్వ రమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పా రు.

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

 ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

లింగసముద్రం, జనవరి 18: ప్ర జల సమస్యలను అధికారులు సత్వ రమే పరిష్కరించాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి చెప్పా రు. మంగళవారం ఎంపీడీవో కార్యా లయంలో జరిగిన మండల సర్వస భ్య సమావేశంలో ఎమ్మెల్యే మహీ ధర్‌రెడ్డి, ఎంఎల్‌సీ తూమాటి మాధవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తూమాటి వనజ మా ట్లాడుతూ లింగసముద్రంలో మంచినీటి పైపులకు అక్రమ కుళాయిలు ఏర్పాటు చేశారని, అలాగే విద్యుత్‌ తీగలు ఇళ్లపై వేలాడుతున్నాయని చెప్పారు. అన్నె బోయినపల్లిలో వలంటీరు, రేషన్‌ షాపును ఒకరే నిర్వహిస్తున్నారని ఎంపీటీసీ చిలకా చంటి చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి, మినుము పైర్లు దెబ్బతిన్నాయని, వాటికి నష్ట పరిహారం ఇప్పించాలని పలు వురు సభ్యులు పేర్కొన్నారు. వీటిపై సం బంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ పెన్నా కృష్ణయ్య, జడ్పీటీసీ డా.సీహెచ్‌ నళినీపద్మ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T05:23:10+05:30 IST