నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-03-01T04:52:35+05:30 IST
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా పని చేయాలని ఆర్డీవో రాములు సిబ్బందిని ఆదేశించారు.
- ఆర్డీవో రాములు ఆదేశం
గద్వాల, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళికి అనుగుణంగా పని చేయాలని ఆర్డీవో రాములు సిబ్బందిని ఆదేశించారు. గద్వాల మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో 14,876 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తె లిపారు. మొత్తం 93 మంది అభ్యర్థులతో కూడిన బ్యాలెట్ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఉమాదేవి, డీపీఓ కృష్ణ, శిక్షకులు నరేష్, తిమ్మారెడ్డి ఉన్నారు.