ఆ ఘనత బీజేపీదే: మంత్రి పేర్నినాని

ABN , First Publish Date - 2021-11-08T21:35:36+05:30 IST

పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదేనని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రజలపై దయ, జాలి లేకుండా పెట్రో రేట్లను పెంచారని మండిపడ్డారు.

ఆ ఘనత బీజేపీదే: మంత్రి పేర్నినాని

అమరావతి: పెట్రోల్‌ ధరను వంద దాటించిన ఘనత బీజేపీదేనని మంత్రి పేర్నినాని అన్నారు. ప్రజలపై దయ, జాలి లేకుండా పెట్రో రేట్లను పెంచారని మండిపడ్డారు. రూ.70 పెట్రోల్‌ను రూ.115కు తీసుకెళ్లి తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, ఢిల్లీలో ఎందుకు పన్నులు తగ్గించలేదు? అని ప్రశ్నించారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏపీ బీజేపీ నేతలు.. టీడీపీ స్క్రిప్ట్‌ను చదవడం కాదని, అందరూ వస్తే పెట్రో ధరలపై పార్లమెంట్‌ దగ్గర ధర్నా చెద్దామన్నారు. 

Updated Date - 2021-11-08T21:35:36+05:30 IST