విశాఖ ఆత్మహత్యకు పాల్పడిన కరోనా పాజిటివ్ వ్యక్తి
ABN , First Publish Date - 2020-07-14T16:59:43+05:30 IST
విశాఖ: కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని శాంతి నగర్కు చెందిన
విశాఖ: కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖలోని శాంతి నగర్కు చెందిన భూతల శ్రీను మహేష్(48)అనే వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే అతను ఆ విషయాన్ని దాచి ఈ నెల 11న ఉదయం నాలుగు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనంతరం నిర్వహించిన శవ పరీక్షలో శ్రీనుకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆత్మహత్య చేసుకున్న రోజున స్థానికులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో శాంతినగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినందునే శ్రీను ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.