చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-30T04:59:04+05:30 IST

తిరుపతిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కడప(క్రైం), నవంబరు 29: తిరుపతిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. చెన్నూరుకు చెందిన ఓబులేసు కడప వైజంక్షన్‌లోని షేమియానా దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తుం డేవాడు. శనివారం రాత్రి స్కూటరులో ఇంటికి వెళుతుండగా కోటిరెడ్డిసర్కిల్‌ సమీపం వద్దకు రాగానే స్కూటరును ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించగా మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - 2020-11-30T04:59:04+05:30 IST