కారు, లారీ ఢీ.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-03-07T16:46:45+05:30 IST

కరీంనగర్: కారు, లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కారు, లారీ ఢీ.. వ్యక్తి మృతి

కరీంనగర్: కారు, లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని పరకాల క్రాస్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. హుజురాబాద్‌కు చెందిన మనిదీప్(21) అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - 2021-03-07T16:46:45+05:30 IST