వ్యాపారాభివృద్ధికి ఫ్లెక్సీ కడుతూ...
ABN , First Publish Date - 2022-01-20T06:22:10+05:30 IST
ముదునూరు పాడులో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 19: ముదునూరు పాడులో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడేనికి చెందిన పి. సతీష్కుమార్ (24) తన స్నేహితుడు పాపారావుతో కలిసి ఆటో స్పేర్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం పాపారావుతో పాటు మరో యువకుడు రాంబాబుతో కలసి ఒక భవనం పైకి వెళ్లి వ్యాపారానికి సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా 11 కేవి వైర్లు తగలడంతో సతీష్కుమార్ విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. ఇతనితో పాటు ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. సతీష్కుమార్ను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఎస్ఐ జీజే ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.