మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-08-08T16:59:11+05:30 IST
హైదరాబాద్: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి హత్య జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకున్నాయి.
హైదరాబాద్: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి హత్య జరిగింది. సంఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీమ్ చేరుకున్నాయి. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. జవహర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిన్న రాత్రి రాజు.. విజయ్ కుమార్ ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో విజయ్పై రాజు అనే వ్యక్తి రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విజయ్ కుమార్ 15 సంవత్సరాల క్రితం వలస వచ్చి అంబేద్కర్ నగర్లో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి పాప.. బాబు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జవహర్ నగర్ పోలీసులు కేసు విచారణ నిర్వహిస్తున్నారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.