నన్ను మళ్లీ జైలుకు పంపండి
ABN , First Publish Date - 2022-02-03T15:31:49+05:30 IST
నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్ హత్యకేసు ముద్దాయిల్లో ఒకరైన మనోజ్ తన నిబంధన బెయిల్ రద్దుచేసి, మళ్లీ జైలుకు పంపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు
- కొడనాడు హత్యకేసు ముద్దాయి మనోజ్
ప్యారీస్(చెన్నై): నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్ హత్యకేసు ముద్దాయిల్లో ఒకరైన మనోజ్ తన నిబంధన బెయిల్ రద్దుచేసి, మళ్లీ జైలుకు పంపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్లో భారీస్థాయిలో జరిగిన దోపిడి, సెక్యూరిటీ గార్డ్ సహా పలువురి హత్యకేసులో వయలారుకు చెందిన మనోజ్ సహా పదిమందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, నిబంధనలతో కూడిన బెయిల్పై విడుదలైన మనోజ్, ఊటీలో తాను నివసించేందుకు స్థలం లేదని, చేతిలో చిల్లిగవ్వ లేనందువల్ల పస్తులతో గడుపు తున్నానని, అందువల్ల మళ్లీ జైలుకు తరలించాలంటూ అభ్యర్ధిస్తూ న్యాయస్థానంలో దాఖలుచేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది.