భార్యతో గొడవ పడి.. భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-22T07:40:06+05:30 IST

భార్యాభర్తల మధ్య వివాదం చినికి చినికి గాలి వాన లా మారి భర్త ఆత్మహత్యకు దారితీసింది.

భార్యతో గొడవ పడి.. భర్త ఆత్మహత్య

బుట్టాయగూడెం, జూన్‌ 21: భార్యాభర్తల మధ్య వివాదం చినికి చినికి గాలి వాన లా మారి భర్త ఆత్మహత్యకు దారితీసింది. సోమవారం రెడ్డి గణపవరంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. భార్యాభర్తల మధ్య గొడవ జరగగా  భర్త యదాల గోపి(28) సారాలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. అనంతరం విషయాన్ని తండ్రికి చెప్పడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఏలూరు, ఆపై విజయవాడ తరలిస్తుండగా గోపి  చనిపోయాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కుటుంబరావు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-22T07:40:06+05:30 IST