వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-17T04:45:44+05:30 IST
కలుగొట్లకు చెందిన హనుమంతు(32) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎమ్మిగనూరు, జనవరి 16: కలుగొట్లకు చెందిన హనుమంతు(32) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. హనుమంతుకు ఎనిమిదేళ్ల క్రితం సరోజతో పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు సంతానం. ఆర్థిక భారం అధికం కావడం, అప్పులు పెరిగిపోవడంతో శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగాడు. స్థానికులు ఆటోలో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.