పెచ్చుమీరుతున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదం : వీహెచ్‌పీ

ABN , First Publish Date - 2022-07-01T02:58:34+05:30 IST

శంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం రోజురోజుకు పెరిగిపోతున్నదని విశ్వహిందూ పరిషత్‌ కావలిశాఖ సంఘటనా కార్యదర్శి కే. సంజీ

పెచ్చుమీరుతున్న ఇస్లామిక్‌ ఉగ్రవాదం : వీహెచ్‌పీ
శివాజీ బొమ్మ వద్ద నిరసన తెలుపుతున్న విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌ నేతలు

కావలి, జూన్‌30: దేశంలో ఇస్లామిక్‌ ఉగ్రవాదం రోజురోజుకు పెరిగిపోతున్నదని విశ్వహిందూ పరిషత్‌ కావలిశాఖ సంఘటనా కార్యదర్శి కే. సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఉదయపూర్‌లో నిరుపేద టైలర్‌ కన్హయ్యలా ల్‌ను హత్యచేసినందుకు నిరసనగా గురువారం ట్రంకురోడ్డులోని శివాజీ సెంటర్‌లో విశ్వహిందూపరిషత్‌, భజరంగదళ్‌ నేతలు  ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉదయపూర్‌లో జరిగిన సంఘటన దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత్‌ నాయకులు సుబ్బరాయుడుగుప్తా, బాలాజీ, దివి నరసింహారావు, కోట సురేంద్రరెడ్డి, భజరంగదళ్‌ నాయకులు నాగరాజు, గోపాల్‌, రమేష్‌, హరినాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T02:58:34+05:30 IST