దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2021-07-30T18:36:04+05:30 IST
మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్ వేశారు.
అమరావతి: మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు సంబంధించి కోర్టులో డీఎస్పీ పిటిషన్ వేశారు. మంగళవారం దేవినేని ఉమను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. హైకోర్టుకు వచ్చిన దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ మంగళవారానికి వాయిదా పడింది. ఈలోపు దేవినేని ఉమ నుంచి.. మరిన్ని వివరాలు రాబట్టాలని కస్టడీలోకి ఇవ్వాలని పోలీసులు కోరారు.