జగన్కు కళ్లెం వేయండి.. సుప్రీంలో పిటిషన్
ABN , First Publish Date - 2020-10-30T08:24:12+05:30 IST
న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర మణపై అబాంఢాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది...
న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర మణపై అబాంఢాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయింది. సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది బుధవారం ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై జగన్కానీ, ఆయన ప్రతినిధులు కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని, షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆయన కోరారు.