జగన్‌కు కళ్లెం వేయండి.. సుప్రీంలో పిటిషన్‌

ABN , First Publish Date - 2020-10-30T08:24:12+05:30 IST

న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.ర మణపై అబాంఢాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది...

జగన్‌కు కళ్లెం వేయండి.. సుప్రీంలో పిటిషన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.ర మణపై అబాంఢాలు వేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి బహిరంగంగా విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయింది. సునీల్‌ కుమార్‌ సింగ్‌ అనే న్యాయవాది బుధవారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అంశంపై జగన్‌కానీ, ఆయన ప్రతినిధులు కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని, షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2020-10-30T08:24:12+05:30 IST