అచ్చెన్నకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2020-07-06T20:47:11+05:30 IST

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ ..

అచ్చెన్నకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కస్టడీ కూడా పూర్తవడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు. ముందు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించటంతో అచ్చెన్నాయుడు తరఫు న్యాయవాదులు హైకోర్టుకు వెళ్ళారు. అచ్చెన్నకు మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించాలని ఇప్పటికే ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు.


Updated Date - 2020-07-06T20:47:11+05:30 IST