పెట్రో పన్ను కొత్త భర్తీకి అప్పులు

ABN , First Publish Date - 2022-05-23T08:38:22+05:30 IST

పెట్రో పన్నుల కోతతో ఏర్ప డిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

పెట్రో పన్ను కొత్త భర్తీకి అప్పులు

మరో రూ.లక్ష్య  కోట్ల రుణాలకు ప్రభుత్వం సన్నాహాలు.. పెరుగనున్న వడ్డీ రేట్లు , ద్రవ్యలోటు 


పెట్రో పన్ను కోత భర్తీకి అప్పులుమరో రూ.లక్ష కోట్ల రుణాలకు ప్రభుత్వం సన్నాహాలు.. పెరగనున్న వడ్డీ రేట్లు, ద్రవ్య లోటున్యూఢిల్లీ: పెట్రో పన్నుల కోతతో ఏర్ప డిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్కెట్‌ రుణాల ద్వారా ఈ లోటు భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ద్వితీయార్థంలో ఈ రుణం సేకరించాలని యోచిస్తున్నట్టు సమాచారం. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో కేంద్ర పన్నుల రాబడికి ఈ ఆర్థిక సంవత్సరం రూ.లక్ష కోట్ల మేరకు గండి పడనుంది. జీఎస్‌టీ వసూళ్లు బాగున్నా ఎరువులు, ఆహార సబ్సిడీ బిల్లూ ఈ ఆర్థిక సంవత్సరం భారీగా పెరగనుంది. దీంతో పెట్రో పన్ను కోత ద్వారా ఏర్పడిన రూ.లక్ష కోట్ల ఆదాయ లోటును మార్కెట్‌ రుణాల ద్వారా సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 


వడ్డీ రేట్లు జూమ్‌ !

కేంద్ర ప్రభుత్వ చర్యతో దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఈ మధ్యనే  రెపో రేటును ఒక్కసారిగా 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచేసింది. దీంతో పదేళ్ల కాలపరిమితి ఉండే ప్రభుత్వ రుణ పత్రాలపై వడ్డీ రేటు 7 నుంచి 7.39 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  మార్కెట్‌ రుణాల ద్వారా రూ.14.3 లక్షల కోట్లు సమీకరించబోతున్నట్టు ఆర్థిక మంత్రి సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పుడు ఈ ఖాతా మరో రూ.లక్ష కోట్లు పెరగనుంది. దీంతో రుణ పత్రాల మార్కెట్‌ మరింత వేడెక్కి.. దేశంలో వడ్డీ రేట్లు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 


6.9 శాతానికి ద్రవ్య లోటు 

ప్రభుత్వ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటుపైనా పడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్య లోటు జీడీపీలో 6.4 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. రుణ సేకరణ మరో రూ.లక్ష కోట్లు పెరిగితే ఇది జీడీపీలో 6.9 శాతానికి చేరుతుందని ఆర్థికవేత్తల అంచనా. 


మరో రూ.2 లక్షల కోట్ల ఖర్చులు 

ప్రభుత్వం ఇంత చేసినా దేశంలో ద్రవ్యోల్బణం మాత్రం ప్రభుత్వాన్ని ఇంకా భయపెడుతోంది. పెట్రో పోటుకు తోడు ఆహార ధాన్యాలు, వంట నూనెల మంటతో సామాన్యుడు కుదేలైపోతున్నాడు. మరోవైపు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగల నుంచి ప్రజల్ని కొంతైనా కాపాడేందుకు ప్రభుత్వం త్వరలో మరిన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం రూ.2 లక్షల కోట్లతో ఆహార, ఎరువులు, వంట గ్యాస్‌ సబ్సిడీలు మరింత పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-05-23T08:38:22+05:30 IST