పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఎం
ABN , First Publish Date - 2021-06-20T05:46:41+05:30 IST
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కోదాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీ తంగా పెరుగుతున్నాయన్నారు.
కోదాడరూరల్ / మేళ్లచెర్వు, జూన్ 19 : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం కోదాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ముత్యాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచటం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీ తంగా పెరుగుతున్నాయన్నారు. డీజిల్, పెట్రోల్పై జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ముత్యాలతో పాటు ఆ పార్టీ నాయకులు సాయికుమార్, వెంకన్న, వీరయ్య, లింగయ్య, సైదులు, రాజు పాల్గొన్నారు. మేళ్లచెర్వులో సీపీఎం ఆధ్వర్యంలో పెట్రో ధరల పెంపును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వట్టెపు సైదులు, నాయకులు రాంబాబు, సైదులు, లక్ష్మీనారాయణ, మదర్, జైపాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.