PFI Protest.. కడప: ఎన్ఐఏకు వ్యతిరేకంగా పిఎఫ్ఐ ఆందోళన
ABN , First Publish Date - 2022-09-20T18:31:55+05:30 IST
కడపలో పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నాయకుటు ఆందోళన చేపట్టారు.
కడప (Kadapa): నగరంలోని ఆర్డీవో కార్యాలయం (RDO Office) ఎదుట పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) (People Front of India) నాయకులు ఆందోళన (Protest) చేపట్టారు. ఎన్ఐఏ (NIA)కు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ముస్లీం వ్యక్తులు, సంస్థలపైన ఉగ్రవాదుల విచారణ పేరుతో చేస్తున్న దాడులను ఖండిస్తూ నిరసన తెలిపారు. అమాయక ముస్లీంలపై కుట్ర పూరిత దాడులు ఆపాలంటూ పిఎఫ్ఐ నాయకుటు డిమాండ్ చేస్తున్నారు.
కాగా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అనుమానంతో పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శిక్షణా కార్యక్రమాలపై ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిన్న కడప నగరంలో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులు ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు సమాచారం ఉండడంతో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు.