కాలేజీ హాస్టల్‌లో ఓ గది ముందు ఓ యువతి కేకలు.. ఏమైందా అని అంతా కంగారుగా వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-05-28T20:27:30+05:30 IST

ఆ యువతి వయసు 21 సంవత్సరాలు.. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటూ బీ ఫార్మసీ చదువుకుంటోంది..

కాలేజీ హాస్టల్‌లో ఓ గది ముందు ఓ యువతి కేకలు.. ఏమైందా అని అంతా కంగారుగా వెళ్లి చూస్తే..

ఆ యువతి వయసు 21 సంవత్సరాలు.. స్నేహితులతో కలిసి హాస్టల్‌లో ఉంటూ బీ ఫార్మసీ చదువుకుంటోంది.. శుక్రవారం సాయంత్రం చదువుకోవాలని చెప్పి ఖాళీగా ఉన్న రూమ్‌కు వెళ్లింది.. కొంతసేపటి తర్వాత ఆ గదిలోకి వెళ్లిన మరో యువతి లోపల దృశ్యం చూసి కేకలు పెట్టింది.. ఏమైందా అని అంతా కంగారుగా వెళ్లి చూసే సరికి లోపల ఆ యువతి ఆత్మహత్య చేసుకుని కనిపించింది.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

పరువు పోయిందని ప్రాణం తీసుకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు.. ప్రేయసితో పాటు కొడుకు ఊళ్లోంచి పారిపోయాక..


ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన యామినీ ఠాకూర్ అనే 21 ఏళ్ల యువతి భారతీ కాలేజ్‌లో బీ ఫార్మసీ చదువుకుంటోంది. ఆ కాలేజీకే చెందిన గర్ల్స్ హాస్టల్‌లో ఉంటోంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన గదిలో స్నేహితులతో మాట్లాడింది. అనంతరం చదువుకోవాలని చెప్పి పక్కనే ఖాళీగా ఉన్న మరో గదిలోకి వెళ్లింది. కాసేపటి తర్వాత యామిని కోసం మరో యువతి ఆమె ఉన్న గదికి వెళ్లింది. అయితే అప్పటికే యామిని ఉరేసుకుంది. 


లోపల దృశ్యం చూసి షాకైన యామిని స్నేహితురాలు గట్టిగా కేకలు వేసి అందరినీ పిలిచింది. కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సమచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. చనిపోయే ముందు యామిని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఏముందో మాత్రం బయటకు వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-28T20:27:30+05:30 IST