రసాయన శాస్త్ర పరిశోధక విద్యార్థికి పీహెచ్డీ
ABN , First Publish Date - 2021-04-24T05:26:03+05:30 IST
టీయూలోని రసాయన శాస్త్ర అధ్యాయనశాఖ పరిశోధక విద్యార్థి రాచ హన్మాండ్లుకు శుక్రవారం పీహెచ్డీ ప్రధానం చేశారు. రసాయన శాస్త్ర అధ్యాయన శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ బీ.సాయిలు పర్యవేక్షణలో సింట్రసిస్ బయోలాజికల్ యాక్టీవిటీ ఆఫ్ నోవెల్ హెటిరో టూసైడ్ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు.
డిచ్పల్లి, ఫిబ్రవరి 23: టీయూలోని రసాయన శాస్త్ర అధ్యాయనశాఖ పరిశోధక విద్యార్థి రాచ హన్మాండ్లుకు శుక్రవారం పీహెచ్డీ ప్రధానం చేశారు. రసాయన శాస్త్ర అధ్యాయన శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ బీ.సాయిలు పర్యవేక్షణలో సింట్రసిస్ బయోలాజికల్ యాక్టీవిటీ ఆఫ్ నోవెల్ హెటిరో టూసైడ్ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆచార్యుడు తిరుమలచారి పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ డీన్ డాక్టర్ అరుణ, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, బాలకిషన్, డాక్టర్ నాగరాజు, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.