వీడియో కాల్ మాట్లాడుతూ రెండవ అంతస్తు‌ నుంచి పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-07-18T01:52:13+05:30 IST

వీడియో కాల్ మాట్లాడుతూ రెండవ అంతస్తు‌ నుంచి పడి వ్యక్తి మృతి

వీడియో కాల్ మాట్లాడుతూ రెండవ అంతస్తు‌ నుంచి పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండవ అంతస్తు‌పై నుండి జారీ పడి వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధి మణికొండలో జరిగింది. మణికొండలో నివసించే తాళ్ళూరి శ్యామ్యూల్ సుజిత్(32) ఈరోజు ఉదయం తన సోదరుడితో ఫోన్‌లో వీడియో కాల్ మాట్లాడుతుండగా రెండవ అంతస్తు బాల్కనీ‌పై నుండి ప్రమాదవశాత్తు జారీ పడ్డాడు. వెంటనే పక్కింటి వాళ్లు గమనించి సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. గాయపడ్డ సుజిత్‌ను కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే సుజిత్ తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ భాగ్యరాజ్ ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-07-18T01:52:13+05:30 IST