చీటీల పేరుతో మోసం
ABN , First Publish Date - 2021-12-05T05:54:14+05:30 IST
మండలంలోని పొనుగుపాడులో చీటీల పేరుతో మోసి చేసి రూ.2కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ.2.05 కోట్లతో పరారైన కుటుంబం
ఫిరంగిపురం, డిసెంబరు 4: మండలంలోని పొనుగుపాడులో చీటీల పేరుతో మోసి చేసి రూ.2కోట్ల 5 లక్షలతో ఓ కుటుంబం పరారైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పొనుగుపాడు గ్రామానికి చెందిన నిడమానూరు భీమేశ్వరరావు కుటుంబం 12 సంవత్సరాలుగా గ్రామంలో చీటిపాటలు వేస్తున్నారు. ఆరు రోజులుగా చీటి పాటల డబ్బు తీసుకొని ఇంటికి తాళం వేసుకొని పరారైనట్టు ఫిరంగిపురం పోలీసు స్టేషన్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.అజయ్బాబు తెలిపారు.