క్రీడలతో శారీరక దృఢత్వం

ABN , First Publish Date - 2022-08-18T06:20:51+05:30 IST

క్రీడలతో శారీరకంగా దృఢం ఉండవచ్చని, విద్యార్థి దశ నుంచే పిల్లలు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

క్రీడలతో శారీరక దృఢత్వం
వాలీబాల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఆగస్టు 17: క్రీడలతో శారీరకంగా దృఢం ఉండవచ్చని, విద్యార్థి దశ నుంచే పిల్లలు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం అంబేద్కర్‌ స్టేడియంలోని ఇండోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలు మొబైల్‌ గేమ్‌లను కాకుండా శారీరక శ్రమను కలిగించే కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌ ఆడాలన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతరెడ్డి, డీఈవో జనార్దన్‌రావు, ఎన్‌వైకే కో ఆర్డినేటర్‌ వెంకట రాంబాబు, టీఎన్జీవో యూనియన్‌ ప్రెసిడెంట్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ దారం శ్రీనివాస్‌, పెటా అధ్యక్ష, కార్యదర్శులు ఎ శ్రీనివాస్‌, యూనిస్‌ పాషా పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:20:51+05:30 IST