దళిత బంధు పథకంపై హైకోర్టులో పిల్ దాఖలు
ABN , First Publish Date - 2021-07-31T01:12:11+05:30 IST
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై
హైదరాబాద్: రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు అయింది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు హైకోర్టులో పిల్ వేశాయి. హుజురాబాద్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీని ప్రతివాదులుగా పిల్లో పిటిషనర్లు చేర్చారు.