‘ఏకగ్రీవాలకు ఉన్న అర్థాన్ని వైసీపీ దారుణంగా మార్చేసింది’

ABN , First Publish Date - 2021-03-04T22:37:35+05:30 IST

‘ఏకగ్రీవాలకు ఉన్న అర్థాన్ని వైసీపీ దారుణంగా మార్చేసింది’

‘ఏకగ్రీవాలకు ఉన్న అర్థాన్ని వైసీపీ దారుణంగా మార్చేసింది’

గుంటూరు: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బెదిరించి బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. వైసీపీ చర్యలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెనాలి 39,40 వార్డుల్లో టీడీపీ తరపున నామినేషన్ వేసిన ఎస్సీ అభ్యర్థులను బెదిరించారని మాణిక్యరావు తెలిపారు. క్యాష్ లేదా కేస్ అన్న విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలకు ఉన్న అర్థాన్ని వైసీపీ దారుణంగా మార్చేసిందన్నారు. ఎస్సీ అభ్యర్థుల బలహీనతతో ఆడుకుంటున్నారని పిల్లి మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-03-04T22:37:35+05:30 IST