నడిగూడెం ఖ్యాతి నిలిపిన పింగళి
ABN , First Publish Date - 2022-08-08T06:53:58+05:30 IST
నడిగూడెం కోటలో జాతీయ జెండాకు రూపం ఇచ్చి ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన పింగళి వెంకయ్య భావితరాలకు స్ఫూర్తిదాయకుడని సాంఘీక సంక్షేమ శాఖల జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ బానాల కవితనాగరాజు అన్నారు.
నడిగూడెం, ఆగస్టు 7: నడిగూడెం కోటలో జాతీయ జెండాకు రూపం ఇచ్చి ఈ ప్రాంత ఖ్యాతిని ప్రపంచానికి చాటిన పింగళి వెంకయ్య భావితరాలకు స్ఫూర్తిదాయకుడని సాంఘీక సంక్షేమ శాఖల జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ బానాల కవితనాగరాజు అన్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఇంటింటికీ జాతీయ జెండా కార్యక్రమాన్ని తపాలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించి కోటలో జాతీయజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్ల వజ్రోత్స వాలను ఘనంగా నిర్వహించుకుని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగర వేయలన్నారు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ భానుశ్రీ, మతిన్, వీరబాబు, కొల్లు పుల్లయ్యచౌదరి, నజీర్, షరీప్, శరత్, వెంకన్న, సీపీఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యానారాయణ తదితరులు పాల్గొన్నారు.