వైసీపీ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత మండిపాటు

ABN , First Publish Date - 2022-07-26T21:24:16+05:30 IST

వైసీపీ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అవినీతిపై 14400కు కాల్ చేయమనడం హాస్యాస్పదమన్నారు.

వైసీపీ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత మండిపాటు

అమరావతి: వైసీపీ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అవినీతిపై 14400కు కాల్ చేయమనడం హాస్యాస్పదమన్నారు. తాడేపల్లి ప్యాలెస్లో అవినీతిపై ఎవరికి కాల్ చేయాలి? అని ఆమె ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఏ నంబర్కు కాల్ చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి 1100 టోల్ఫ్రీ నంబర్ చంద్రబాబు పెట్టారని ఆమె గుర్తు చేశారు. ఉద్యోగులను టార్గెట్ చేసుకొని 14400 నంబర్ను వైసీపీ పెట్టిందన్నారు. సిమెంటు కంపెనీలను సిండికేట్పై ‘‘న్యాయ విచారణకు సిద్ధమా?, బాక్సైట్, ల్యాటరైట్ ద్వారా అవినీతి మైనింగ్ పై విచారణకు సిద్ధమా?, మద్యం రేట్లు పెంచి బినామీలతో చేస్తున్న వ్యాపారంపై విచారణకు సిద్ధమా?’’ అని ఆమె ప్రశ్నించారు. ఏటా చంద్రబాబు తన కుటుంబ ఆస్తులను వెల్లడిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం జగన్ ఇంతవరకు తన ఆస్తుల వివరాలు ప్రకటించలేదని పేర్కొన్నారు. ముందు జగన్ సీబీఐ విచారణకు హాజరై.. ఆ తర్వాత నీతులు చెప్పాలని సూచించారు. 

Updated Date - 2022-07-26T21:24:16+05:30 IST