వైసీపీ నేతలు ఆవిషయంపై సమాధానం చెప్పలేరా..?: పీతల సుజాత

ABN , First Publish Date - 2021-07-06T19:57:01+05:30 IST

పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బాక్సైట్ తవ్వకాల ..

వైసీపీ నేతలు ఆవిషయంపై సమాధానం చెప్పలేరా..?:  పీతల సుజాత

చిత్తూరు:  ప్రజలను పక్కదారి పట్టిస్తునందుకే తెలుగుదేశంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పీతల సుజాత  మండిపడ్డారు. మంగళవారం మీడియాతో పీతల సుజాత మాట్లాడుతూ.. పీలేరులో రూ.400 కోట్ల భూకుంభకోణం, విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ బాక్సైట్ తవ్వకాల గురించి టీడీపీ ప్రశ్నిస్తే అధికార వైసీపీ నేతలు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. అమరావతిలో అవినీతి అంటూ కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భూకుంభకోణం, అక్రమ బాక్సైట్ తవ్వకాలపై విచారణ జరిపించాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-07-06T19:57:01+05:30 IST