వైసీపీ అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు
ABN , First Publish Date - 2021-03-01T05:54:17+05:30 IST
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఆదివారం సాయంత్రం తాడిపర్తి త్రిమూర్తులు, నక్కా సత్యనారాయణ ఆ
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
గొల్లప్రోలు రూరల్, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో ఆదివారం సాయంత్రం తాడిపర్తి త్రిమూర్తులు, నక్కా సత్యనారాయణ ఆధ్వర్యాన 200 మంది కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారందరికీ వర్మ టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వర్మ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా చెందుర్తిలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. పనులు చేయకపోగా వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేక వైసీపీని వదిలి టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఉత్సాహంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మడికి ప్రసాద్, బోనబోయిన శివ తదితరులు పాల్గొన్నారు.