వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2021-03-03T07:05:13+05:30 IST

పిఠాపురం రూరల్‌, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పిలుపునిచ్చారు. పి.

వైసీపీ పాలనకు చరమగీతం పాడాలి
టీడీపీలో చేరిన వారితో మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం రూరల్‌, మార్చి 2: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ పిలుపునిచ్చారు. పి.దొంతమూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు మంగళవారం జరిగిన టీడీపీలో చేరారు. వీరిని వర్మ పార్టీలోకి ఆహ్వానిస్తూ టీడీపీ విజయం కోసం పనిచేయాలని కోరారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దీనికి టీడీపీలో చేరికలే నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో నడిపల్లి నాగు, లయశెట్టి దొరబాబు, సోమరౌతు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T07:05:13+05:30 IST