రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వైసీపీ

ABN , First Publish Date - 2021-10-18T04:49:27+05:30 IST

పిఠాపురం, అక్టోబరు 17: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు నిలిపివేసి అరాచకం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన

రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వైసీపీ
వర్మను అభినందించిన నాయకులు, కార్యకర్తలు

టీడీపీ అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, అక్టోబరు 17: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు నిలిపివేసి అరాచకం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఒక్క అభివృద్ధి పని జరగడం లేదన్నారు. టీడీపీ హయాంలో తీసుకువచ్చిన ఏలేరు రెండోదశ ఆధునీకరణ, రూ.40కోట్లు విలువైన రోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేశారని ఆరోపించారు. నిధులు తెచ్చినా వాటిని వినియోగించుకోలేదని, కొత్తగా నిధులు తేవడంలో విఫలమయ్యారని వర్మ విమర్శి ంచారు. విద్యుత్‌ చార్జీల పెంపు, విద్యుత్‌ కోతలకు వ్యతిరేకంగా గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయించాలని సూచించారు. అధికార ప్రతినిధిగా నియమితులైన వర్మను నాయకులు, కార్యకర్తలు అభినందించారు. సమావేశంలో టీడీపీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్‌, మండలాధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, బర్ల అప్పారావు, జ్యోతుల సతీష్‌, కేతవరపు కృష్ణ, మలిరెడ్డి వెంకటరమణ, మాదేపల్లి శ్రీను, జవ్వాది జోగేశ్వరరావు, నల్లా శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:49:27+05:30 IST