పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-01-23T05:15:18+05:30 IST
గొల్లప్రోలు రూరల్, జనవరి 22: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీలకు నూతనంగా వచ్చిన 24 ట్రైసైకిళ్లు(చెత్తరిక్షాలు), 144 డస్ట్బిన్లు, ఏడు
పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు
గొల్లప్రోలు రూరల్, జనవరి 22: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలిపారు. గొల్లప్రోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీలకు నూతనంగా వచ్చిన 24 ట్రైసైకిళ్లు(చెత్తరిక్షాలు), 144 డస్ట్బిన్లు, ఏడు ఫాగింగ్ మిషన్లును ఆయన ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులకు అందజేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగలోవరాజు, వైసీపీ మండలాధ్యక్షుడు అరిగెల రామయ్యదొర, కడిమిశెట్టి భాస్కరరెడ్డి, ఎంపీడీవో హరిప్రియ పాల్గొన్నారు.