బుజ్జగింపు రాజకీయాలు ఇక సాగవు: పియూష్‌ గోయల్

ABN , First Publish Date - 2022-07-04T00:38:46+05:30 IST

తెలంగాణ ప్రజలు ఇక అవినీతిని సహించలేరని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు ఇక సాగవన్నారు.

బుజ్జగింపు రాజకీయాలు ఇక సాగవు: పియూష్‌ గోయల్

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఇక అవినీతిని సహించలేరని కేంద్రమంత్రి పియూష్‌ గోయల్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు ఇక సాగవన్నారు. మార్పు తుఫాన్‌ తెలంగాణ అంతటా కనిపిస్తోందన్నారు. మంచి పాలనను తెలంగాణ ప్రజలు కోరకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అవినీతి పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, యువత కష్టాలు ఎదుర్కొంటోందన్నారు. తెలంగాణకు ఇప్పుడు ఉన్నది ఒక్కటే ప్రత్యామ్నాయమని, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ నిలుస్తోందన్నారు. తన ప్రభుత్వం చేజారిపోతోందని కేసీఆర్‌కు అర్థమవుతోందన్నారు. తెలంగాణలో మార్పు రావడం సహజమన్నారు. 



Updated Date - 2022-07-04T00:38:46+05:30 IST