బిగ్-5 భారత్కు చోటు... త్వరలో...
ABN , First Publish Date - 2022-01-19T22:49:30+05:30 IST
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో భారత్ది ఎన్నో స్థానం..? షేర్లను షేకాడించే చిచ్చరపిడుగుల్లో కూడా చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవచ్చు. అయితే... ఈ విషయం తెలుసుకోవాలన్న నిబంధనేదీ లేదుగానీ, తెలుసుకుంటే మాత్రం... కాస్త లాభం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో భారత్ది ఎన్నో స్థానం..? షేర్లను షేకాడించే చిచ్చరపిడుగుల్లో కూడా చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవచ్చు. అయితే... ఈ విషయం తెలుసుకోవాలన్న నిబంధనేదీ లేదుగానీ, తెలుసుకుంటే మాత్రం... కాస్త లాభం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మొత్తంమీద పెట్టుబడుల ఔట్లుక్ మారుతుందని చెబుతున్నారు. కాగా... ఈ పై ప్రశ్నకు సమాధానం... మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా దేశాల లీగ్ టేబుల్లో భారత్ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఐదోస్థానంలో ఉన్న బ్రిటన్ను అధిగమించి, ఆ ప్లేస్లోకి రావడానికి అతి కొద్దిదూరంలో మాత్రమే ఉంది. మమరిన్ని వివరాలిలా ఉన్నాయి.
bk
మొదటి నాలుగు స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్ దేశాన్నాయి. భారత్లో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 3.67 ట్రిలియన్ డాలర్లు. ఇక... 3.75 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్తో ఉన్న బ్రిటన్కంటే కేవలం రెండు శాతం మాత్రమే తక్కువ. నెల రోజుల క్రితం సుమారు ఎనిమిది శాతంగా ఉన్న ఈ అంతరం తగ్గుతూ వచ్చి, ఇప్పుడు... రెండు శాతానికి వచ్చింది. త్వరలోనే ఇది కూడా సమసిపోతుందన్న అంచనాలున్నాయి. అయితే...ఇదే సమయంలో వచ్చిన షార్ప్ కరెక్షన్తో అంతరం పెరిగింది. డిసెంబరు 20 న, సెన్సెక్స్ నాలుగు నెలల కనిష్ట స్థాయి 55,822 కు పడిపోవడంతో, భారత ర్యాంక్ ఫ్రాన్స్ కంటే తగ్గి, ఏడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత డాలర్ పరంగా బలపడి, ఎనిమిది శాతం కంటే ఎక్కువ లాభాలతో మళ్లీ ఆరో స్థానానికి చేరింది. ఇక... 3.37 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉన్న ఫ్రాన్స్ను అధిగమించేందుకు ఈ బౌన్స్బ్యాక్ దోహదం చేసింది. ఫెడరల్ రిజర్వ్ హాకిష్ స్టాన్స్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి, టెక్నాలజీ స్టాక్స్లో అమ్మకాల కారణంగా కిందటి నెలలో అమెరికా, చైనా, జపాన్ దేశాలు మార్కెట్ క్యాప్ను కోల్పోయాయి.
చమురు ధరల పెరుగుదల, బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి ఎదురుగాలులు ఉన్నప్పటికీ, వాల్యుయేషన్ ఖరీదుగా మారిందని పదేపదే చెప్పుకున్నప్పటికీ, భారత మార్కెట్ 2021 లో 24 శాతం లాభపడడం గమనార్హం. బారత మార్కెట్లలో బలమైన లిక్విడిటీ ఉందన్న విషయం తెలిసిందే. ఎస్ఐపీ ఇన్ఫ్లోల్లో దూకుడుతో మ్యూచువల్ ఫండ్స్ భారీగా వృద్ధి చెందాయి. రిటైల్ భాగస్వామ్యం బలంగా ఉంది. ఓవర్సీస్ సెల్లింగ్ నెమ్మదించడం మరింత మద్దతునిచ్చింది. కార్పొరేట్ ఆదాయాలపై అంచనాలు భారీగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశ మార్కెట్ విలువ పెరగడానికి రూపాయి బలపడడం కూడా కారణమైంది. ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా పెరగాలంటే కార్పొరేట్ ఆదాయాల వృద్ధి బలంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ50 కంపెనీల అంచనా ఆదాయాల ప్రకారం... వీటి మొత్తం ఆదాయాలు... 2022 ఆర్ధిక సంవత్సరంలో స్వల్పంగా తగ్గుతాయి. ఇక... 2023, 2024 ఆర్ధిక సంవత్సరాల్లో స్వల్పంగా పెరుగుతాయి. ప్రస్తుత(2023) ఆర్ధిక సంవత్సరంలో 30 శాతం, 2023 ఆర్ధిక సంవత్సరంలో 15 శాతం, 2024 ఆర్ధిక సంవత్సరంలో 15 శాతం ఆదాయ వృద్ధి అంచనాలున్నాయి.