ఎడ్బిడ్ మల్లన్నకు భక్తుల మొక్కులు
ABN , First Publish Date - 2021-03-01T05:40:09+05:30 IST
మండలంలోని ఎడ్బిడ్ మల్లన్న దేవుడి జాతరకు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రారంభమైన మూడో రోజున ఆదివారం ఎడ్బిడ్ గ్రామంతో
ముథోల్, ఫిబ్రవరి, 28: మండలంలోని ఎడ్బిడ్ మల్లన్న దేవుడి జాతరకు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రారంభమైన మూడో రోజున ఆదివారం ఎడ్బిడ్ గ్రామంతో పాటు మండలం లోని కారేగాం, వెంకటాపూర్, చించాల, చింతకుంట, భైంసా మండలంలోని కామోల్, పుస్పూర్ గ్రామాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాకుండా పలువురు భక్తులు మొక్కులు తీర్చాలని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. కాగా, సోమవారం లక్ష రూపా యాల వ్యయంతో కుస్తీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ కుస్తీ పోటీలకు మహారాష్ట్ర నుంచి మల్ల యోధులు తరలి వస్తారు. రాత్రి అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమం, అన్న దానం నిర్వహిం చనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు.