రెడ్క్రాస్లో 150వ ప్లాస్మాదానం
ABN , First Publish Date - 2021-05-11T03:47:30+05:30 IST
రెడ్క్రాస్ రక్తనిధిలో సోమవారం 150 వ ప్లాస్మాదానం జరిగింది. రెడ్క్రాస్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ఈ ప్లాస్మాదానం చేశారు.
నెల్లూరు (వైద్యం) మే 10 : రెడ్క్రాస్ రక్తనిధిలో సోమవారం 150 వ ప్లాస్మాదానం జరిగింది. రెడ్క్రాస్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ ఈ ప్లాస్మాదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కరోనాతో పోరాడుతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు కరోనా నుంచి కోలుకున్న బాధితులు ప్లాస్మాదానం చేయాలని కోరారు. ప్లాస్మాథెరపీ బాధితులకు సంజీవనిలా పనిచేస్తుందన్నారు. ప్లాస్మాదానం చేసిన దాతలందరికీ రెడ్క్రాస్ తరఫున ప్రత్యేక ధన్యవదాలు తెలుపుతున్నామన్నారు. దానానికి మరింత మంది ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ కమిటీ సభ్యులు బయ్యాప్రసాద్, రక్తనిధి కన్వీనర్ అజయ్బాబు, పురాణం లోకేష్, పెంచల పుల్లయ్య, డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు.