Platform 65: దేశంలోనే అతిపెద్ద టాయ్ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ మన వరంగల్లో!
ABN , First Publish Date - 2022-09-12T21:17:58+05:30 IST
భారతదేశంలో అతిపెద్ద టాయ్ ట్రైన్ రెస్టారెంట్ వరంగల్లో ప్రారంభమైంది. ‘ప్లాట్ఫామ్ 65’ పేరుతో అందుబాటులోకి
వరంగల్: భారతదేశంలో అతిపెద్ద టాయ్ ట్రైన్ రెస్టారెంట్ వరంగల్లో ప్రారంభమైంది. ‘ప్లాట్ఫామ్ 65’ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ రెస్టారెంట్ వరంగల్ (Warangal)వాసులకు అద్వితీయమైన రుచులతోపాటు ఆహార అనుభవాలను అందించనుంది. ఈ రెస్టారెంట్లో అన్ని రకాల ఆహార పదార్థాలను టాయ్ ట్రైన్లో సరఫరా చేస్తారు. రెస్టారెంట్ రంగంలో గత రెండేళ్లుగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ‘ప్లాట్ఫామ్ 65’ (Platform 65) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోనూ తన శాఖను విస్తోంది. ఇటీవలే తన ఏడో అవుట్లెట్ను బెంగళూరులో ప్రారంభించింది.
వరంగల్లోని ‘ప్లాట్ఫామ్ 65’ తమ వినియోగదారులకు ఆంధ్రా, తెలంగాణ, చైనీస్ వంటకాలను అందించనుంది. రెస్టారెంట్ వాతావరణం కూడా రైల్వే స్టేషన్ను పోలి ఉంటుంది. సీట్లు కూడా అచ్చం రైళ్లలోని సీట్లను పోలి ఉంటాయి. అలాగే, ప్రతి టేబుల్కు ప్రత్యేకంగా ఓ పేరు ఉంటుంది. అంటే బెంగళూరు, మైసూర్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ వంటి పేర్లన్నమాట. ఈ సందర్భంగా ప్లాట్ఫామ్ 65 (వరంగల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. వరంగల్లో ప్లాట్పామ్ 65ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.