నిబద్ధతకు పెద్దపీట : పుట్టా

ABN , First Publish Date - 2021-07-27T05:09:04+05:30 IST

పార్టీకి కష్టపడి పని చేసే నిబద్ధత కల్గిన నాయకులకే పదవులు అప్పగించినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

నిబద్ధతకు పెద్దపీట : పుట్టా
మండల టీడీపీ నూతన అధ్యక్షులతో పుట్టా సుధాకర్‌యాదవ్‌

మైదుకూరు, జూలై 26: పార్టీకి కష్టపడి పని చేసే నిబద్ధత కల్గిన నాయకులకే పదవులు అప్పగించినట్లు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేశారు. మైదుకూరు మున్సిపాలిటీకి దాసరి బాబు, మండలానికి ముద్దం చిన్న సుబ్బరాయుడు, బి.మఠంకు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, ఖాజీపేటకు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి, దువ్వూరుకు బోరెడ్డి వెంకట రమణారెడ్డి పేర్లను ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా పుట్టా మాట్లాడుతూ పార్టీలో పదవులు రాలేదని ఎవ్వరూ బాధపడకూడదని, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల టీడీపీ నేతలు పాల్గొన్నారు.


చిన్నయ్యరెడ్డి కుటుంబానికి పరామర్శ

దువ్వూరు, జూలై 26: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన  సీనియర్‌ టీడీపీ నేత చిన్నయ్యరెడ్డి కుటుంబాన్ని మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌ పరామర్శించారు. మండల పరిధిలోని నీలాపురం గ్రామానికి చెందిన చిన్నయ్యరెడ్డి ఇటీవల ఉదయగిరి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పుట్టా సుధాకర్‌యాదవ్‌   సోమవారం గ్రామానికి వెళ్లి భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎలాంటి సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కుమార్తెల విద్యాభ్యాసం కోపం పాటుపడుతామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత రవిబాబును, కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కడప పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు తుమ్మల వెంకటకొండారెడ్డి, దువ్వూరు మండల కన్వీనర్‌ పోరెడ్డి వెంకటరెడ్డి, అన్నవరం సుధాకర్‌రెడ్డి, జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్‌, చంద్ర ఓబుళరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T05:09:04+05:30 IST