ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలి : ఏపీటీఎఫ్
ABN , First Publish Date - 2021-12-06T05:45:05+05:30 IST
ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించే ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ పత్రికా సంపాదకుడు పి.తులసీనాథం నాయుడు పిలుపు నిచ్చారు.
చిత్తూరు (సెంట్రల్), డిసెంబరు 5: ఏపీ టీచర్స్ ఫెడరేషన్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో శ్రీకాకుళంలో నిర్వహించే ప్లాటినం జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ పత్రికా సంపాదకుడు పి.తులసీనాథం నాయుడు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాష్, గోపినాథ్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. గోపినాథ్ మాట్లాడుతూ పీఆర్సీ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7వ తేదీ నుంచి చేపట్టే ఉద్యమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, ముక్తార్, అఫ్జల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.