పీఆర్‌సీ జీవోలు సవరించి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-01-25T04:56:56+05:30 IST

పీఆర్‌సీ జీవోలను సవరించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల రాష్ట్ర ఔట్‌ సోర్సింగ్‌ జనరల్‌ సెక్రటరీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో కోరారు.

పీఆర్‌సీ జీవోలు సవరించి న్యాయం చేయాలి

నాయుడుపేట టౌన్‌, జనవరి 24 : పీఆర్‌సీ జీవోలను సవరించి న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల రాష్ట్ర ఔట్‌ సోర్సింగ్‌ జనరల్‌ సెక్రటరీ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వం  ఈ నెల 17న విడుదల చేసిన పీఆర్‌సీ జీవోల కారణంగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఆ జీవోలను సవరించి సమానపనికి సమానవేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-25T04:56:56+05:30 IST