కేజ్రీవాల్‌ను అభినందించిన మోదీ

ABN , First Publish Date - 2022-03-12T01:01:02+05:30 IST

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ..

కేజ్రీవాల్‌ను అభినందించిన మోదీ

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌లో ఆప్‌ను,  అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించారు. పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌కు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. 'థాంక్యూ సార్' అంటూ ట్వీట్ చేశారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుని అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది.

Updated Date - 2022-03-12T01:01:02+05:30 IST