అల్లూరి విగ్రహావిష్కరణకు మోదీతో పాటు రఘురామరాజు వస్తాడా?

ABN , First Publish Date - 2022-06-30T01:30:16+05:30 IST

ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. జులై 4న మోదీ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ...

అల్లూరి విగ్రహావిష్కరణకు మోదీతో పాటు రఘురామరాజు వస్తాడా?

అమరావతి (Amaravathi)/ హైదరాబాద్ (Hyderabad): ప్రధాని మోదీ (Pm Modi) ఏపీ (Ap)లో పర్యటించనున్నారు. జులై 4న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bheemavaram)లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలోని ఏఎస్సార్ పార్కులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జులై 2,3 తేదీల్లో హైదరాబాద్‌లో (Hyderabad) బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలనంతరం ప్రధాని మోదీ ఏపీకి వెళతారు. అయితే సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు (Mp Raghuramaraju) కూడా పాల్గొంటారని తెలుస్తోంది.  మరోవైపు ఆయనను అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డుకుంటారని ప్రచారం జరుగుతోంది. 


ఈ నేపథ్యంలో ‘‘అల్లూరి విగ్రహావిష్కరణకు రఘురామరాజు వస్తాడా?. క్షత్రయం వర్గం రఘురాజుకి అండగా నిలుస్తుందా?. రాజును అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందా?.ప్రధాని ప్రోగ్రాం ఎంపీ లేకుండా చేయాలనుకోవడం సమంజసమా?. రఘురామరాజుకు ప్రధాని కార్యాలయం మద్దతు ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (Abn Andhrajyothy) డిబేట్ నిర్వహించింది.  ఈ డిబేట్ వీడియోను చూడగలరు..



Updated Date - 2022-06-30T01:30:16+05:30 IST